
విజయనగంలోని గురజాడ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక విజయనగరం జిల్లా కమిటీ విస్తృతస్థాయి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈనెల 25 నుంచి విజయనగరంలో ఉమ్మడి జిల్లా కమిటీ మహాసభలు జరగబోతున్నాయని, వాటిని విజయవంతం చేయాలని JVV వ్యవస్థాపకుడు బ్రహ్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆనంద్ పిలుపునిచ్చారు. జూలై నెలలో కడప జిల్లాలో రాష్ట్ర మహాసభలకు సన్నద్ధమవుతున్నామన్నారు.